April 21, 2024

(సియాసత్ దినపత్రిక సౌజన్యం, వెబ్ వర్షన్ అగష్టు 22)

…………………………………………………………………………..

కర్నాటకలో హత్యకు గురైన భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడు  ప్రవీణ్ నెట్టారు కుటుంబాన్ని కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలోని విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు మహేష్ శెట్టి తిమరోడి పరామర్శించారు. ప్రవీణ్ హత్యపై మాట్లాడుతూ “హిందూత్వ పేరుతో ఇదంతా ప్రారంభించింది మేమే” అని పేర్కొన్నారు. ప్రవీణ్ హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

‘రాజకీయాల్లో పడవద్దు‘ అని చాలాసార్లు చెప్పినా యువత వినలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హిందుత్వం పేరుతో ఇదంతా ప్రారంభించింది మనమే కాబట్టి ఏం చెప్పాలో తెలియడం లేదని ఆయన అన్నారు.

మితవాద హిందుత్వ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అది దాడులకు దారితీస్తుందని వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు తిమరోడి పేర్కొన్నారు. “వాళ్ళు (ముస్లింలు) కాదు, ఈ బీజేపీ వాళ్ళు మాపై దాడి చేస్తారు. వాళ్ల నాయకులు మాపై దాడి చేస్తారు’’ అని అన్నారాయన.